నిన్న రాజయ్య.. నేడు దుర్గం చిన్నయ్య

by Dishafeatures2 |
నిన్న రాజయ్య.. నేడు దుర్గం చిన్నయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మహిళలపై వేధింపుల సంఘటన మారువకముందే నేడు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాష్టికలు బయటకు రావడం మహిళ సమాజాన్ని భయాందోళనలకు గురి చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నిత్యం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నరని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని, బెల్లంపల్లి అసెంబ్లీలో నెన్నెల మండలంలో దాదాపు 200 ఎకరాల భూమి కబ్జా చేసినట్లు దుర్గం చెన్నయ్యపై అరోపణలు ఉన్నాయన్నారు. సింగరేణి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసిన చిన్నయ్యకు ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మహిళలను టార్గెట్ చేయడం చిన్నయ్యకు కొత్తేమి కాదన్నారు. గతంలోనూ లక్ష్మీ అనే మహిళ తన భూమి చిన్నయ్య, అతడి అనుచరులు అక్రమంగా కబ్జా చేశారని, హరీష్ రావు సమక్షంలో పురుగుల మందు తాగిందన్నారు. అంతే కాక నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేశాడన్నారు. ఇలా చెప్తూ పోతే చిన్నయ్య చరిత్ర ఈ రోజుదో ఒడిసేది కాదన్నారు. తాజాగా ఆరిజన్ డైరీ నిర్వాహకులను డబ్బుల కోసం, చిన్నయ్య తన కామ కోరికలు తీర్చడం కోసం అనేక రకాలుగా అందులోని మహిళ నిర్వాహకులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్టినట్లు వార్తల్లో వస్తున్న కథనాలు మనసును చిదిమేస్తున్నాయని వివరించారు. ఇలాంటి కామపూరిత రాక్షస వ్యక్తిత్వం గల చిన్నయ్యకు ఎమ్మేల్యేగా కొనసాగే నైతికత లేదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



Next Story